'పర్సంటైల్‌తోనే ఎంసెట్ ర్యాంకులివ్వాలి' | ' Percentile rankings given by the .Concepts ' | Sakshi
Sakshi News home page

'పర్సంటైల్‌తోనే ఎంసెట్ ర్యాంకులివ్వాలి'

Apr 29 2015 2:40 AM | Updated on Sep 3 2017 1:02 AM

ఎంసెట్ తుది ర్యాంకుల ఖరారులో 25 శాతం వెయిటేజీని ఇంటర్ మార్కులను బట్టి ఇవ్వొద్దని జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు.

హైదరాబాద్: ఎంసెట్ తుది ర్యాంకుల ఖరారులో 25 శాతం వెయిటేజీని ఇంటర్ మార్కులను బట్టి ఇవ్వొద్దని, అలా చేస్తే తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు.

ఇంటర్ మూల్యాంకనంలో ఏపీ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేశారని, దీంతో తెలంగాణలోని ఇంజనీరింగ్, మెడికల్ ఓపెన్ కోటాలో ఎక్కువ సీట్లు ఏపీ విద్యార్థులకు వెళతాయన్నారు. దీనిపై ప్రభు త్వం కల్పించుకొని పర్సంటైల్‌తో ర్యాంకులను ఖరారు చేసేలా జేఎన్‌టీయూకు ఆ దేశాలు జారీ చేసి చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement