పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: హరీశ్‌రావు | Palamuru pending the completion of the project will be: harisrao | Sakshi
Sakshi News home page

పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: హరీశ్‌రావు

Aug 6 2014 1:02 AM | Updated on Sep 2 2017 11:25 AM

పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: హరీశ్‌రావు

పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: హరీశ్‌రావు

మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఐదులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.

అలంపూర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఐదులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎస్ పనులను న్యాయ నిపుణుల కమిటీ నివేదిక  మేరకు కేంద్రబలగాలను రప్పించైనా చేయిస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి కరెంట్‌ను కొనుగోలు చేసి రైతులు ఇబ్బం దులు పడకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వ్యవసాయానికి ఏడుగంటల   కరెంట్‌ను అందించనున్నామన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement