దేవుళ్లకు తప్పని కష్టాలు | officials are neglecting the temple for god | Sakshi
Sakshi News home page

దేవుళ్లకు తప్పని కష్టాలు

Feb 12 2018 2:41 PM | Updated on Feb 12 2018 2:41 PM

officials are neglecting the temple for god - Sakshi

రింగన్‌ఘాట ఆలయంలోని ఆంజనేయ ప్రతిమలు

 కెరమెరి : అధికారుల నిర్లక్ష్యంతో పునరావాస కాలనీల ప్రజలకు దైవ దర్శనం కరువైంది. పునరావస కాలనీలు నిర్మాణమే తమ వంతు అనుకున్న అధికారులు అక్కడ దేవాలయాలను నిర్మించడం మరిచిపోయారు. దీంతో ప్రజలు విరాళాలు సేకరించి గుడిసెలు నిర్మించి పూజలు చేసుకుంటున్నారు. ఐదారేళ్ల క్రితం మండలంలోని నిషా ని, రింగన్‌ఘాట్‌ పునరావాస కాలనీల్లో దేవాలయాలు లేక పూజలు చేసేదెక్కడని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా పునరావాసం  కాలనీలు  ఉన్న చోట పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు, కోరుకున్న దే వాలయాలను నిర్మించాలని నిబంధనల్లో ఉంది. కాని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement