డీఎస్‌ కుమారుడికి నోటీసులు | Nizamabad Police Issue Notice To D Sanjay | Sakshi
Sakshi News home page

డీఎస్‌ కుమారుడికి నోటీసులు

Aug 11 2018 6:53 AM | Updated on Oct 17 2018 6:10 PM

Nizamabad Police Issue Notice To D Sanjay - Sakshi

డీ. సంజయ్‌ (ఫైల్‌ ఫోటో)

అతనిపై నిర్భయ కేసుతో సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది..

సాక్షి, నిజామాబాద్‌ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని శనివారం నిజామాబాద్‌ పోలీసులు ఆదేశించారు. శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. గత వారం రోజులుగా సంజయ్‌ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

తనపై ఇటీవల నమోదైన లైంగిక వేధింపులు కేసుపై ప్రభుత్వం విచారిస్తే తప్పకుండా సహారికరిస్తానని ఇటీవల ప్రకటించిన మాజీ మేయర్‌ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. తమపై లైంగిక వేధింపుల వేధింపులకు పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ కేసుతో సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం అతని కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement