ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఆదిలాబాద్ (బాసర) : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా సెలవులు, నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆరవ రోజు సరస్వతీ దేవి కాత్యాయినీ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.