మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని | Narendra Modi to attend Mission Bhagiratha project Inauguration | Sakshi
Sakshi News home page

7న మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని

Jul 20 2016 7:07 PM | Updated on Aug 15 2018 9:35 PM

మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని - Sakshi

మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరు కానున్నారు.

మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ (వాటర్గ్రిడ్) ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.  వచ్చేనెల 7న ప్రధాని తెలంగాణకు రానున్నారు. గజ్వేల్ మండలం సంగాపూర్, కోమటిబండలో ప్రధాని మిషన్ భగీరధ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సభ ఏర్పాట్లను మిషన్ భగీరధ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ బుధవారం పరిశీలించారు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధానిని కలిసి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement