సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో జరిగే ప్రమాదాలను శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషిచేయాలని అధికారులకు, కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో జరిగిన సింగరేణి సంస్థ 45వ త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశంలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, గుర్తింపు సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా లో వృద్ధిరేటుతో పురోగమిస్తున్న సంస్థను ప్రమాదరహితంగా రూపుదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి గనిలో మ్యాన్ రైడి రగ్ సిస్టంలను ఏర్పాటు చేశామని, అందరికీ తేలికపాటి ఎల్ఈడీ క్యాపు ల్యాంపులను సమకూర్చామని తెలిపారు. ఓ.సి.గనుల్లో ఓ.బి (ఓవర్ బర్డెన్) డంపు సామర్థ్యంపై సిస్రో (ఆస్ట్రేలియా కంపెనీ)తో అధ్యయనం చేయిస్తున్నామని, భూగర్భ గను ల్లో రక్షణ పెంపుదలకు తగిన శిక్షణ, సూచనల కొరకు సిమ్టార్స్ (ఎస్ఐఎమ్టీఆర్ఎస్) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.
ప్రమాదాలు జరుగుతున్న విభాగాలను, పరిస్థితులను గమనించి అక్కడ తీసు కోవాల్సిన రక్షణ చర్యలపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రక్షణ అనేది యాజమాన్య బాధ్యతే కాదని, ప్రతి కార్మికుడు, ప్రతి అధికారి బాధ్యత అన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రమాదాలను నివారించి శూన్య స్థానానికి తీసుకురాగలమని పేర్కొన్నారు. డిప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) విద్యాపతి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తీసుకొంటున్న రక్షణ చర్యలు ప్రశంసనీయమన్నారు. టెక్నాజీలతో ఇక్కడి అధికారులు, కార్మికులు బాగా పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్నారని, ప్రమాదాలనూ శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. వీటి నివారణకు కార్మిక సంఘాలు చేస్తున్న సూచనలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, కార్మికులు కూడా భద్రతతో పనిచేయాలని సూచించారు.
సింగరేణిలో ప్రమాదాలను నివారిస్తాం
Published Fri, Dec 28 2018 1:06 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement