ఎన్నాళ్లిలా...కళ్లు ‘మూసీ’! | Musée river conservation scheme second phase | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లిలా...కళ్లు ‘మూసీ’!

Jun 20 2015 1:04 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఎన్నాళ్లిలా...కళ్లు ‘మూసీ’! - Sakshi

ఎన్నాళ్లిలా...కళ్లు ‘మూసీ’!

చారిత్రక మూసీ నది పరిరక్షణ పథకం రెండో దశపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

- రూ.922.97 కోట్లతో పరిరక్షణకు యత్నాలు
- కాగితాల్లోనే ప్రతిపాదనలు
- మురుగు శుద్ధి కేంద్రాలకు స్థలాల కేటాయింపులో జాప్యం
- కేంద్ర నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం
సాక్షి, సిటీబ్యూరో:
చారిత్రక మూసీ నది పరిరక్షణ పథకం రెండో దశపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీని కోసం మూడేళ్ల క్రితమే రూ.922 కోట్ల అంచనాతో జలమండలి సిద్ధం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్న దాఖలాలు లేవు. ఈ పథకంలో భాగంగా మూసీ నదిలోకి చేరుతున్న 610 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాల శుద్ధికి పది మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) నిర్మించాల్సి ఉంది. వీటికి స్థలాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇటీవలఈ పథకంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్ష నిర్వహించినప్పటికీ... ఇప్పటి వరకు స్థలాల కేటాయింపుపై స్పష్టత రాలేదు. వ్యర్థాలతో మూసీ నది మురికి కూపమైంది.

నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలో కలుస్తోంది. గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మొదటి దశ ప్రక్షాళనకుశ్రీకారం చుట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజూ వెలువడుతున్న 592 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసి నదిలోకి వదిలే ఏర్పాట్లు చేశారు.రెండోదశ ప్రక్షాళనలో నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యం.

దీనికోసం రూ.922.97 కోట్ల అంచనాతో 10 ప్రాంతాల్లో సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. మరోమూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని నిర్ణయించారు. వీటికి స్థలాల కేటాయింపుపై రాష్ట్ర సర్కారు శ్రద్ధ చూపడం లేదు. దీంతో కేంద్రం విడుదల చేసే 70 శాతం నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమని సమాచారం.

కష్టాలు తీరేదెన్నడో...
బల్క్ డ్రగ్ పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాల నుంచి వెలువడుతున్న  వ్యర్థాలతో మూసీ నది మురికి కూపమైంది. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలో కలుస్తోంది. గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మొదటి దశ ప్రక్షాళనకుశ్రీకారం చుట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజూ వెలువడుతున్న 592 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసి నదిలోకి వదిలే ఏర్పాట్లు చేశారు.రెండోదశ ప్రక్షాళనలో నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యం.

దీనికోసం రూ.922.97 కోట్ల అంచనాతో 10 ప్రాంతాల్లో సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. మరోమూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని నిర్ణయించారు. వీటికి స్థలాల కేటాయింపుపై రాష్ట్ర సర్కారు శ్రద్ధ చూపడం లేదు. దీంతో కేంద్రం విడుదల చేసే 70 శాతం నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement