Places Allocation
-
టెండర్లు దాటని ఠికానా
మొదలుకాని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లు నిధులు కేటాయించి రెండేళ్లు ముందుకు సాగని నిర్మాణాలు ఎట్టకేలకు స్థలాల కేటాయింపు పూర్తి నాలుగు చోట్ల రెండోసారి టెండర్లు పిలుపు సాక్షి ప్రతినిధి, వరంగల్ : శాసనసభ్యులకు నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం మెుదలు కావడ లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు శాశ్వతంగా క్యాంపు కార్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ బాధ్యతలను రహదారులు–భవనాల శాఖకు అప్పగించింది. ఒక్కొక్క క్యాంపు కార్యాలయ నిర్మాణానికి కోటి రూపాయల చొప్పున నిధులను కేటాయించింది. ఈ ప్రక్రియ మొదలై రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా పనులు మొదలవడం లేదు. శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో ఉండాలని, వాస్తుపరంగా రహదారులు ఉన్న స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేలు రెవెన్యూ అధికారులకు సూచించారు. దీంతో కొంత జాప్యం జరిగింది. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మరిపెడకు వస్తారని అందువల్ల అక్కడే స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలెక్టర్కు సూచించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు క్యాంపు కార్యాలయానికి కలెక్టర్ స్థలం కేటాయించారు. ఇలా జిల్లాలోని 12 నియోజకవర్గాలకు స్థలాలు కేటాయించడంతో టెండర్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. రెండోసారి పిలుపు... ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు స్థలాలు కేటాయించడంతో పనులు పర్యవేక్షించే ప్రక్రియను రోడ్లు, భవనాల శాఖ చేపట్టింది. 12 నియోజవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి టెండరు పిలిచింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, ములుగు, భూపాలపల్లి, జనగామ, వర్థన్నపేట, స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాల్లో నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. ఐదు క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులను ఒకే సంస్థ దక్కించుకుంది. మరో మూడు క్యాంప్ ఆఫీసు నిర్మాణాల పనుల టెండరు ప్రతిపాదనలను చీఫ్ ఇంజనీరు ఆమోదం తెలపాల్సి ఉంది. మిగతా నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజవర్గాల్లో నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మాణం చేపట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ టెండర్లు పిలిచినా ఆయా ఎమ్మెల్యేల ఆమోదం ఉంటేనే టెండర్లు దాఖలు చేసే పరిస్థితి ఉందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ కారణంగానే నాలుగు నియోజకవర్గాల్లో నిర్మాణాలకు టెండర్లు దాఖలు కాలేదని తెలిసింది. నిర్మాణం ఇలా.. శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాల భవనాలకు 60 గజాల వెడల్పు, 90 గజాల పొడవుతో స్థలాలను కేటాయించారు. ఒక్కో అంతస్తు 2100 ఫీట్ల విస్తీర్ణంలో ఉంటాయి. గ్రౌండ్ఫ్లోర్లో రెండు కార్లు పార్కింగ్ చేసే విధంగా షెడ్డు, రిసెప్షనిస్టు, ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వచ్చే సందర్శకులు వేచి ఉండే గదులు, ఎమ్మెల్యే ఛాంబర్, యాంటి రూం(అంతర్గతంగా మాట్లాడేందుకు), 20 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించే హాల్లను నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు నివాసం ఉండే విధంగా వంట గది, సందర్శకుల గది, పూజ గది, డైనింగ్హాల్, ఒక మాస్టర్ బెడ్రూం, చిల్డ్రన్స్ బెడ్రూం, అతిథుల కోసం మరో బెడ్రూం ఉండే విధంగా మొదటి అంతస్తును నిర్మిస్తారు. -
ఎన్నాళ్లిలా...కళ్లు ‘మూసీ’!
- రూ.922.97 కోట్లతో పరిరక్షణకు యత్నాలు - కాగితాల్లోనే ప్రతిపాదనలు - మురుగు శుద్ధి కేంద్రాలకు స్థలాల కేటాయింపులో జాప్యం - కేంద్ర నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది పరిరక్షణ పథకం రెండో దశపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీని కోసం మూడేళ్ల క్రితమే రూ.922 కోట్ల అంచనాతో జలమండలి సిద్ధం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్న దాఖలాలు లేవు. ఈ పథకంలో భాగంగా మూసీ నదిలోకి చేరుతున్న 610 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాల శుద్ధికి పది మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) నిర్మించాల్సి ఉంది. వీటికి స్థలాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇటీవలఈ పథకంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్ష నిర్వహించినప్పటికీ... ఇప్పటి వరకు స్థలాల కేటాయింపుపై స్పష్టత రాలేదు. వ్యర్థాలతో మూసీ నది మురికి కూపమైంది. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలో కలుస్తోంది. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మొదటి దశ ప్రక్షాళనకుశ్రీకారం చుట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజూ వెలువడుతున్న 592 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసి నదిలోకి వదిలే ఏర్పాట్లు చేశారు.రెండోదశ ప్రక్షాళనలో నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యం. దీనికోసం రూ.922.97 కోట్ల అంచనాతో 10 ప్రాంతాల్లో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. మరోమూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని నిర్ణయించారు. వీటికి స్థలాల కేటాయింపుపై రాష్ట్ర సర్కారు శ్రద్ధ చూపడం లేదు. దీంతో కేంద్రం విడుదల చేసే 70 శాతం నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమని సమాచారం. కష్టాలు తీరేదెన్నడో... బల్క్ డ్రగ్ పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో మూసీ నది మురికి కూపమైంది. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలో కలుస్తోంది. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మొదటి దశ ప్రక్షాళనకుశ్రీకారం చుట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజూ వెలువడుతున్న 592 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసి నదిలోకి వదిలే ఏర్పాట్లు చేశారు.రెండోదశ ప్రక్షాళనలో నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యం. దీనికోసం రూ.922.97 కోట్ల అంచనాతో 10 ప్రాంతాల్లో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. మరోమూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని నిర్ణయించారు. వీటికి స్థలాల కేటాయింపుపై రాష్ట్ర సర్కారు శ్రద్ధ చూపడం లేదు. దీంతో కేంద్రం విడుదల చేసే 70 శాతం నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమని సమాచారం.