
భక్తులతో యాదగిరికొండ కిటకిట
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
యాదగిరికొండ(నల్లగొండ):యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడం, పుష్కరాలకు వెళ్ళిన భక్తులు తిరుగు ముఖంలో గుట్టకు తరలిరావడంతో సందడి నెలకొంది. సంగీత భవనం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల క్యూలైన్లు బారులు తీరాయి. మరికొందరు భక్తుల ర ద్దీని చూసి స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
స్వామి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు.