తెలంగాణలో టీడీపీ భూస్థాపితం: మోత్కుపల్లి

Motkupalli Narasimhulu Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైందని టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మండవ వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం భూస్థాపితమవుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ‘బాబు ఓ అసమర్థుడు. ఆయనకు ఏపీలోనే దిక్కులేదు, ఇక తెలంగాణకు ఏం చేయగలడు’అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలంతా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని, సీఎం పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top