‘వాళ్ల బాగోతాలు బయటపెడతా’ | MLA Somarapu Satyanarayana Comments On Opponents In Peddapalli | Sakshi
Sakshi News home page

‘వాళ్ల బాగోతాలు బయటపెడతా’

Jul 12 2018 4:54 PM | Updated on Jul 12 2018 5:53 PM

MLA Somarapu Satyanarayana Comments On Opponents In Peddapalli - Sakshi

ఆర్టీసీ ఛైర్మన్‌, అధికార పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

సాక్షి, పెద్దపల్లి : తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల బాగోతాలు బయటపెడతానని ఆర్టీసీ ఛైర్మన్‌, అధికార పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం గోదావరిఖనిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో తప్పనిసరిగా రామగుండం ప్రాంతంలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. పని చేయని ప్రజాప్రతినిధులపై అవిశ్వాసం పెట్టే హక్కు ప్రజలకు ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement