కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుదర్శించుకున్నారు.
కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ శనివారం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, కార్తీక మాసం నేపథ్యంలో అంజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.