భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురంలోని వింద్యాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య పాల్పడిన సంఘటన వనస్థలిపురంలోని వింద్యాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆసిఫాబేగం అనే మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిత్యం భర్త ఆమెను వేధింపులకు గురిచేసేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.