ఇస్త్రీ చేస్తుండగా కరెంట్ షాక్ | Man dies of electrocution | Sakshi
Sakshi News home page

ఇస్త్రీ చేస్తుండగా కరెంట్ షాక్

Oct 23 2015 7:54 PM | Updated on Oct 9 2018 5:39 PM

బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.

వేములపల్లి (నల్లగొండ) : బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో శుక్రవారం జరిగింది.

గ్రామానికి చెందిన గణేష్(37) ఊరికి వెళ్లడానికి బట్టలు ఇస్త్రీ చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement