తాగిన మైకంలో కరెంటు స్తంభం ఎక్కి.. | Man dies due to electric shock in Hyderabad | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో కరెంటు స్తంభం ఎక్కి..

Nov 20 2017 10:00 AM | Updated on Sep 5 2018 2:26 PM

Man dies due to electric shock in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. తీగలు పట్టుకోవడంతో విద్యుదాఘాతంతో కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఆ వ్యక్తి బతికే ఉన్నాడనుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement