చింతపండు దొంగలించాడని.. | man commits suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

చింతపండు దొంగలించాడని..

Mar 15 2016 12:27 PM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం గుడిదొట్ల గ్రామంలో అవమానభారంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం గుడిదొట్ల గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నర్శింహులు(30) అనే వ్యక్తి చింతపండు దొంగతనం చేశాడని కావరి రాము అనే వ్యక్తి గ్రామంలో పంచాయతీ పెట్టాడు. అంతేకాకుండా అతనిని గ్రామస్తులు చితకబాదారు. దాంతో అవమానంగా భావించిన నర్శింహులు ఇంటికెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామస్తులు అవమానించడంతోనే నర్శింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement