ఏసీబీ వలలో గాందీనగర్‌ ఎస్‌ఐ | ACB Caught Gandhi Nagar PS Sub Inspector Narasimhulu While Accepting Bribe, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో గాందీనగర్‌ ఎస్‌ఐ

Jun 24 2026 8:53 AM | Updated on Jun 24 2026 9:55 AM

ACB Caught Gandhi Nagar PS Sub Inspector Narasimhalu

హైదరాబాద్‌: గాందీనగర్‌ ఎస్‌ఐ నర్సింహులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్‌ అలీఖాన్‌ కథనం ప్రకారం.. సంజీవ్‌సింగ్‌ ఠాకూర్‌ అనే వ్యక్తికి సోదరుడితో వ్యాపార లావాదేవీలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న సోదరుడి ఫిర్యాదు మేరకు సంజీవ్‌సింగ్‌ ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో తనకు ఫేవర్‌ చేయాలంటూ సంజీవ్‌సింగ్‌ ఠాకూర్‌ ఎస్‌.ఐ నర్సింహులుతో రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడలో ఎస్‌ఐ మొదటివిడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. నర్సింహులుపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement