
కాప్రా: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏఎస్రావునగర్ స్టోర్స్ ఇన్చార్జి పీకె.షిహాబ్ తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రామిస్ టు ప్రొటెక్ట్’క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో మీ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆయన పేర్కొన్నారు.