టీఆర్‌ఎస్ భవన్ ముట్టడికి యత్నం | mala mahanadu attacks on TRS bhavan | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ భవన్ ముట్టడికి యత్నం

Dec 11 2015 1:57 PM | Updated on Sep 15 2018 3:07 PM

మాలమహానాడు కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.

హైదరాబాద్: మాలమహానాడు కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే, బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో మాలల తడాఖా ఏంటో టీఆర్‌ఎస్‌కు రుచి చూపిస్తామన్నారు. మాల, మాదిగల మద్య చిచ్చుపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే టీఆర్‌ఎస్‌కు పుట్టగతులుండవని మండిపడ్డారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement