సిరిసిల్ల రూరల్: ఇంటి ముందు ఓ వాహనం వచ్చి ఆగుతుంది. ఒంట్లో ఏ మాత్రం సత్తువ లేని ఆ అవ్వను మర్యాదగా అందులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. తమ పని చేయించుకొని మళ్లీ తీసుకొచ్చి ఇంటి ముందు వదిలేస్తారు. ఆ తర్వాత ఐదేళ్లు కనీసం ఆమెను పట్టించుకునేవారే ఉండరు. రాజ న్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన 70 ఏళ్ల జెలిపెటి నర్సవ్వకు మర్యాద దక్కేది ఒక్క పోలింగ్ రోజు మాత్రమే. ఆమెకు రేషన్ కార్డు.. ఆధార్కార్డు ఉన్నా వేలిముద్రలు సరిపోవటం లేదని బియ్యం ఇవ్వటం లేదు. పింఛన్ జాబితాలో పేరు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమి లో గుడిసె వేసుకొని ఉంటోంది. ప్రభుత్వమే కట్టిచ్చిన మరుగుదొడ్డి కూడా ఉంది. కానీ దానిని వినియోగించుకునేందుకు వీలుగాలేదు.
మతిస్థిమితం లేని 68 ఏళ్ల తమ్ముడు జములయ్య బిక్షాటన చేసి.. స్క్రాప్.. అట్టముక్కలు ఏరుకొని విక్రయించగా, వచ్చే సొమ్ముతో ఇద్దరూ జీవిస్తున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన నర్సవ్వ భర్త ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఓ కుమారుడు, ఓ కూతురు ఉండేవారు. కుమారుడు తల్లిని వదిలి వెళ్లిపోయాడు. కూతురు చనిపోయింది. మతి స్థిమితం లేని తమ్ముడు జములయ్య తోడుగా ఉంటున్నాడు. ఇతనికి కంటిచూపు కూడా లేదు. 40 ఏళ్ల క్రితం వీరికి ప్రభుత్వం వడ్డెర కాలనీలో రెండు గుంటల స్థలాన్ని కేటాయించింది.
ఇల్లు కట్టుకునే స్తోమత లేక.. గుడిసె వేసుకుంది. ఇటీవల అది కూలిపోయింది. స్థానికులు స్పందించి పాలిథిన్ కవర్తో డేరా ఏర్పాటు చేశారు. ప్రభు త్వం వారి కోసం మరుగుదొడ్డిని కట్టించి ఇచ్చింది. అయితే, గ్రామంలోని డ్రైనేజీ నీరు మొత్తం నర్సవ్వ గుడిసె చుట్టే చేరుతుండడంతో మురుగు దొడ్డి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రేషన్ కార్డ్కు వేలిముద్రలు సరిపోకపోవటంతో బియ్యం పంపిణీ చేయటం లేదు. ఈ క్రమంలో చూపులేని.. మతిస్థిమితం సరిగా లేని జములయ్య బిక్షాటన చేస్తూ.. స్క్రాప్.. అట్టముక్కలు ఏరి సంపాదిస్తున్నాడు. ఇరుగు.. పొరుగు పెట్టింది తింటూ అక్కాతమ్ముడు జీవిస్తున్నారు. ఏ పనీ చేసుకోలేని.. కనీస జీవనాధారంలేని ఈ అక్కాతమ్ముళ్లకు అంత్యోదయ కార్డు, పింఛన్ మంజూరు చేయటంతో పాటు తాత్కాలికంగా ఇంటిని నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ఏక్ దిన్ కా రాణి.. ఈ నర్సవ్వ
Published Sun, Dec 10 2017 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement