వంద శాతం పోలింగ్‌కు కృషి చేయాలి 

KTR reference to the press - Sakshi

పత్రికలకు మంత్రి కేటీఆర్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించి వంద శాతం పోలింగ్‌ జరిగేలా పత్రికలు కృషి చేయాలని మంత్రి కె.తారకరామారావు సూచించారు. ఆదివారం బేగంపేట క్యాంప్‌ కార్యాలయంలో ‘ముద్ర’ దిన పత్రికను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో  నెలకొన్న అపోహలను తొలగించే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి, సమస్యల్ని వెలుగులోకి తెచ్చినప్పుడే పత్రికలకు సార్థకత చేకూరుతుందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంపాదకుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరరెడ్డి, శ్రీనివాసగౌడ్, ఆప్కాబ్‌ చైర్మన్‌ కె.రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top