సాక్షి,నల్లగొండ : కేసీఆర్ బీసీ వ్యతిరేకి..జాతీయ నేతల జయంతి సందర్భాల్లో వారి విగ్రహాలకు దండలు కూడా వేయకుండా ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. బుధవారం జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్లోని పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ బీసీలంటే కేసీఆర్కు గౌరవం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను నిర్వీర్యం చేసి విద్యార్థులకు అన్యాయం చేశాడని ఆరోపించాడు. కాంగ్రెస్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించారన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే జయంతితో పాటు వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ వ్యతిరేకి కేసీఆర్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత ప్రాతినిథ్యం ఇస్తోందని అందులో భాగంగానే బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ ఇచ్చిందని తెలిపారు. బీసీ లకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్రెడ్డి, సత్త య్య,వెంకన్న, జ నార్దన్గౌడ్, ముత్యాలు, జి. వెంకటేశ్వర్లు, కిన్నెర శ్రీను, గుండ్లపల్లి శ్రవణ్ పాల్గొన్నారు.
కేసీఆర్ బీసీ వ్యతిరేకి
Published Thu, Nov 29 2018 3:23 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement