-
స్వదేశానికి చేరుకున్న సోనియా
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(70) అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లిన సోనియా, కుమారుడు రాహుల్తో కలిసి గురువారం రాత్రి భారత్కు వచ్చారు. ఈ నెల మొదటివారంలో ఆమె రహస్యంగా అమెరికా వెళ్లిపోయారు. ఆమెతో పాటు ఉండేందుకు రాహుల్ గాంధీ ఈనెల 16వ తేదీన అమెరికా వెళ్లారు. అనారోగ్య కారణాలతోనే ఈ నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ ప్రచారం చేయలేకపోయారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కేడర్లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే సోనియా కొత్త నిర్ణయాలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆయకట్టు బీడు వెనుక కుట్ర
కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేందుకే.. మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపణ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టును బీడు పెట్టడానికి వెనుక భారీ కుట్ర ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలను అన్ని విధాలుగా అణగదొక్కేందుకు సీఎం చంద్రబాబు స్థాయిలో కుట్ర చేశారన్నారు. హంద్రీనీవా, హెచ్చెల్సీ కలిపి 30 టీఎంసీలొచ్చినా ఆయకట్టుకు నీళ్లు వదలలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. కేవలం కుప్పంకు నీటిని తీసుకుపోవడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే కృష్ణా డెల్టా కింద రెండో పంటకు నీరివ్వాలని భావిస్తున్నారన్నారు. రెండేళ్లుగా జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. చెరువులకు నీళ్లిస్తున్నామని చెబుతున్నారని, శింగనమల నియోజకవర్గంలో ఏ చెరువులు నింపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికారప్రతినిధి రమణ, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం--ఎంపీ గుత్తా
తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని హడావుడి చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండలో తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేపడుతున్న రిజర్వాయర్లకు అడ్డుతగలడం సరియైన విధానం కాదన్నారు. రిజర్వాయర్ల నిర్మాణాలను వ్యతిరేకించడమే గాక రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పులిచింతల నిర్మాణంలో నల్లగొండ జిల్లాలో ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోగా జిల్లా పరిధిలో 14 ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని, 14 గ్రామాలు ముంపునకు గురయ్యూయన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కేవలం 16,500 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తరుుతే నల్లగొండ జిల్లాలో 2.63లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. అనవసర రా ద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ గుత్తా విజ్ఞఫ్తి చేశారు. -
సీఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖ
కాశ్మీర్ లోయలో చిక్కుకున్న తెలంగాణాకు చెందిన సుమారు 1000 మంది అమర్నాథ్ యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ రాజీవ్శర్మకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు లేఖ రాశారు. తక్షణమే కాశ్మీర్కు ప్రత్యేక టీంను పంపించి యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మూడు రోజుల నుంచి యాత్రికులు ఇబ్బందులు పడుతోన్నారు. -
250 మంది టీఆర్ఎస్లో చేరిక
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement