స్వదేశానికి చేరుకున్న సోనియా | sonia returns to india | Sakshi
Sakshi News home page

స్వదేశానికి చేరుకున్న సోనియా

Mar 24 2017 5:21 PM | Updated on Oct 22 2018 9:16 PM

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(70) అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లిన సోనియా, కుమారుడు రాహుల్‌తో కలిసి గురువారం రాత్రి భారత్‌కు వచ్చారు.

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(70) అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లిన సోనియా, కుమారుడు రాహుల్‌తో కలిసి గురువారం రాత్రి భారత్‌కు వచ్చారు. ఈ నెల మొదటివారంలో ఆమె రహస్యంగా అమెరికా వెళ్లిపోయారు. ఆమెతో పాటు ఉండేందుకు రాహుల్‌ గాంధీ ఈనెల 16వ తేదీన అమెరికా వెళ్లారు.
 
అనారోగ్య కారణాలతోనే  ఈ నెలలో  జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  సోనియాగాంధీ ప్రచారం చేయలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే సోనియా కొత్త నిర్ణయాలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement