ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు | kcr two letters to pm narendra modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు

Feb 3 2015 8:03 PM | Updated on Sep 5 2018 4:15 PM

ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు - Sakshi

ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు

తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం తగినన్ని బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ కోరారు.

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం తగినన్ని బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ కోరారు. రానున్న 4 నెలల్లో తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని, కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి కేసీఆర్ రెండు లేఖలు రాశారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి తీవ్రమైన విద్యుత్ ఉందని, ఉత్తరాది గ్రిడ్ మిగులు విద్యుత్ ను తమ రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. విభజన ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం గౌరవించకపోవడం వల్లే తెలంగాణ ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కనీసం 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధానికి రాసిన లేఖ ప్రతిని కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్ కూడా కేసీఆర్ పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement