సింగపూర్ నుంచి మలేసియా వెళ్లిన కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సింగపూర్ పర్యటన ముగిసింది. సింగపూర్ నుంచి మలేసియా వెళ్లిన కేసీఆర్ ఆదివారం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. ఈ రోజు రాత్రి 11:55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సింగపూర్ నుంచి కౌలాలంపూర్కు రోడ్డు మార్గాన ప్రయాణించి శాటిలైట్ టౌన్ షిప్ను పరిశీలించారు. ఈ పర్యటనలో కేసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.