ఒకేషనల్‌ విద్యార్థులకు ఉద్యోగ మేళ

Job Fair For Intermediate Vocational Students in Nampally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వృత్తివిద్య అభ్యసించిన విద్యార్థుల కోసం ఈనెల 30న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ఒకేషనల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ అయాజ్‌ అలీఖాన్‌ తెలిపారు. ఆటో మొబైల్‌( ఏఈటీ), మెకానికల్‌ టెక్నాలజీ(ఎంటీ) పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లి బాజహర్‌ఘాట్‌లో ఉన్న ప్రభుత్వ వృత్తి కళాశాలలో ఈ ఉద్యోగ మేళ జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాస్‌, ఫెయిల్‌ అయిన ఇతర గ్రూపుల విద్యార్థులు కూడా ఉద్యోగ మేళాకు హాజరుకావొచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 9395554558 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top