ఎన్నికలు సమీపిస్తుంటే ఉద్యోగ నోటిఫికేషన్లా..? | Janardan Reddy on jobs notification | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సమీపిస్తుంటే ఉద్యోగ నోటిఫికేషన్లా..?

Mar 18 2018 2:33 AM | Updated on Mar 18 2018 2:33 AM

Janardan Reddy on jobs notification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతుంటే వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌ కనుకుల జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో 1.68 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యని ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారని, అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ కూడా 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినా నాలుగోవంతు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement