కేసుల ఎత్తివేతలో రాజకీయం: షబ్బీర్ | In cases an easing of politics: Shabbir | Sakshi
Sakshi News home page

కేసుల ఎత్తివేతలో రాజకీయం: షబ్బీర్

Oct 30 2014 2:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

చదువులు పక్కనపెట్టి తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో

హైదరాబాద్: చదువులు పక్కనపెట్టి తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా కేసుల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.

బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం వంటి ిపీటీ కేసులను మాత్రమే తొలగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర తీవ్రత కలిగిన కేసులను పెండింగ్‌లోనే ఉంచారని విమర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసినట్లు ప్రభుత్వం చెబుతుంటే అడ్వొకేట్లు మాత్రం వారంట్ పెండింగ్‌లో ఉందని పేర్కొంటున్నారని అన్నారు. వారిపై పెట్టిన అన్ని కేసులనూ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement