- చంద్రశేఖర్రెడ్డిని నిలదీసిన స్థానిక నాయకులు
- తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
- మీడియా ఎదుటే నాయకుల వాదులాట
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్లైన్: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇష్టారీతిగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికులను అవమానిస్తున్నారని ఓ వర్గం.. పదవులు కాదు ప్రజల కోసం పనిచేస్తేనే పార్టీ బతుకుతుందని మరో వర్గం వాదులాడుకున్నాయి.
స్థానికులను విస్మరిస్తున్నారు..!
స్థానికంగా ఓ ఫంక్షన్హాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పట్నం నుంచి పోటీ చేసిన కంచర్ల చంద్రశేఖర్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఈ సమావేశానికి స్థానిక నాయకులను ఎందుకు పిలవలేదంటూ పార్టీ మండల అధ్యక్షుడు బోసుపల్లి వీరేశ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మిగితా నాయకులు కూడా కలుగజేసుకుని స్థానికులను దెబ్బతీసేందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రశేఖర్రెడ్డిపై మండిపడ్డారు. పార్టీ ఆవిర్భవ నాటినుంచి తాము శ్రమిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చినవారు తమను విస్మరిస్తున్నారన్నారు. సొంత కళాశాలలో తనకు ఇష్టమొచ్చిన వారితో సమావేశాలు ఏర్పాటు చేసి.. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతో ఇతర పార్టీల దృష్టిలో టీఆర్ఎస్ను చులకన చేసే చర్యలు మానుకోవాలని సూచించారు.
పార్టీ కోసం పనిచేస్తే తప్పా
స్థానిక నాయకుల నుంచి ముప్పేటా దాడి ఎదురుకావడంతో చంద్రశేఖర్రెడ్డి కాసేపు మిన్నకుండిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ పదవుల కోసం తాను సమావేశాలు చేపట్టడం లేదని చెప్పారు. పార్టీకి, ప్రజలకు సేవ చేసేందుకే తాపత్రయపడుతున్నానని ఆవేశంతో అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో వుంది కాబట్టి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకున్న పరిచయాలతో నిధులు రాబట్టాలని కృషి చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల పార్టీకి కలిగే లాభమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర నాయకుడు డబీకార్ శ్రీనివాస్ కలుగజేసుకుంటూ స్థానిక నాయకులను విస్మరిచవద్దని సూచించారు. అయితే సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, జేపీ శ్రీనివాస్, బర్ల జగదీశ్ యాదవ్లు ఈ గొడవలో జోక్యం చేసుకోకుండా సెలైంట్గా వుండిపోయారు.
టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు..!
Published Thu, Jun 12 2014 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement