* భర్తను గొడ్డలితో నరికి హతమార్చిన భార్య
* శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో ఘటన
శంషాబాద్ రూరల్: మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధిస్తుండడంతో భరించలేని భార్య ఆయనను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం మోత్కూరుకు చెందిన దీమ వెంకటయ్య(37) కుల్కచర్ల మండలం బండి ఎల్కచర్ల నివాసి అయిన తన అక్క కూతురు కమలమ్మ అలియాస్ చిన్నమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారులు నవీన్(9), శ్రీకాం త్(6) ఉన్నారు. వెంకటయ్య మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.
ఇదిలాఉండగా మహబూబ్నగర్ జిల్లా కొందుర్గు మండలం కాసులబాద్ నివాసి సిద్ధులు కమలమ్మకు పెద్దమ్మ కొడుకు వరుస. ఇతను ఏడాది క్రితం శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడకు వలస వచ్చి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నాడు. సోదరి అయిన కమలమ్మ మోత్కూరులో గొడవపడుతుండడంతో ఆయన దంపతులను నెల రోజుల క్రితం తీసుకొచ్చి తాను పనిచేసే పౌల్ట్రీఫాంకు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిర్చాడు. అయినా వెంకటయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి 9 గంటలకు మద్యం తాగి వచ్చిన వెంకటయ్య భార్యతో గొడవపడ్డాడు. దీంతో కమలమ్మ వెళ్లి సిద్ధులుకు విషయం చెప్పి ఆయనను తీసుకొచ్చింది.
గొడ్డలితో మెడ నరికి..
వెంకటయ్య మరోమారు కమలమ్మ, సిద్దులుతోనూ గొడవపడ్డాడు. తమనెక్క డ చంపేస్తాడోనని కమలమ్మ భయపడి అక్కడే ఉన్న కారం పొడిని భర్త ముఖం పై చల్లింది. దీంతో వెంకటయ్య కింద పడిపోయాడు. వెంటనే కమలమ్మ గొడ్డలి తీసుకుని ఆయన మెడపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గొడ్డలిని గదిలోనే ఓ చోట దాచిపెట్టి, దానికి ఉన్న కట్టెను పొదల్లో పడేశారు. తర్వాత సిద్ధులు అక్కడి నుంచి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు.
శుక్రవారం ఉదయం ఏమి తెలియనట్లుగా సిద్ధులు తన మామ చనిపోయాడంటూ స్థానికులకు చెప్పా డు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొదట్లో తమకేమి తెలియదని బుకాయించిన కమలమ్మ, సిద్ధులు చివరకు నేరాన్ని అంగీకరించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఠాణాకు తరలించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృ తదేహాన్ని బంధువులకు అప్పగించారు.
అయ్యో పాపం..
తండ్రి హత్యకు గురికావడం.. తల్లి జైలు కు వెళ్లాల్సి రావడంతో చిన్నారులు నవీ న్, శ్రీకాంత్లు అనాథలయ్యారు.
వేధిస్తున్నాడని.. చంపేసింది
Published Sat, Nov 1 2014 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement