
ఆస్తి కోసం ఆలిని నరికేశాడు
ఆస్తి కోసం కట్టుకున్న ఇల్లాలినే అంతం చేశాడు. పొలంలో పనిచేస్తుండగా గొడ్డలితో మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు.
అనంతయ్య ఎనిమిదేళ్ల క్రితం నవనీతను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతయ్య తనకున్న ఎనిమిది ఎకరాల్లోంచి కొంత భూమిని విక్రయించాడు. ఈ నేపథ్యంలో కూతుళ్ల పోషణ భారం కావడంతో పద్మమ్మ మూడు నెలల క్రితం గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో అనంతయ్య అయిష్టంగానే రెండెకరాల పొలాన్ని ఆమెకు ఇచ్చాడు. అయితే పొలం తన వశం కావాలంటే.. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చి పద్మమ్మ పొలంలో పనిచేస్తుండగా.. గొడ్డలితో ఆమె మెడపై నరికేసి పారిపోయాడు.