మద్యం మత్తులో కట్టుకున్న భార్య పై కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి.
మద్యం మత్తులో భార్యకు నిప్పుపెట్టాడు
Mar 5 2016 10:20 AM | Updated on Sep 3 2017 7:04 PM
కొత్తగూడ: మద్యం మత్తులో కట్టుకున్న భార్య పై కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేముల సుగుణ భర్త మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన సుగుణను స్థానికులు 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement