-
భార్యపై భర్త యాసిడ్ దాడి
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని భాస్కర్రావు దిబ్బ ప్రాంతంలో భార్యపై భర్త యాసిడ్తో దాడిచేశాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. భాస్కర్రావు దిబ్బలో ఉంటున్న బ్రహ్మం తన భార్య షేక్ రిజ్వానాపై యాసిడ్తో దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పట్టణ టుటౌన్ ఎస్సై క్రాంతి సంఘటనా స్థలానికి చేరుకొని రిజ్వానాను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆవరణలో దారుణం
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తనపై కేసు పెట్టిన భార్యపై భర్త దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నాగేందర్ పై సౌజన్య 498 కేసు పెట్టింది. కేసు విచారణ వాయిదా కోసం ఇరువురూ ఈ రోజున కోర్టుకు రాగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో భార్యకు నిప్పుపెట్టాడు
కొత్తగూడ: మద్యం మత్తులో కట్టుకున్న భార్య పై కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేముల సుగుణ భర్త మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన సుగుణను స్థానికులు 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
భార్యను రక్షించబోయి భర్త మృతి
ఖమ్మం (ఇల్లెందు) : ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం మోదుగులగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మోదుగులగూడెం గ్రామానికి చెందిన శశిరేఖ తన ఇంటి ఆవరణలో బట్టలను ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురైంది. ఇది చూసిన శశిరేఖ భర్త పగిడిపల్లి రాజు(50) భార్యను రక్షించబోయి ఆమెను పట్టుకుని లాగాడు. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో భార్యకు తీవ్రగాయాలయ్యాయి. బట్టలు ఆరవేసే తీగకు కరెంట్ సరఫరా జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఒకరి మృతి
తల్లాడ (ఖమ్మం): ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారిగూడ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తోన్న భార్యభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement