'దెయ్యం పట్టిందని మాపై దాడి చేశాడు' | wife and daughter murder attempt by Man in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

'దెయ్యం పట్టిందని మాపై దాడి చేశాడు'

Sep 6 2014 9:56 AM | Updated on Jul 30 2018 8:29 PM

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురు(3)పై ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

విజయనగరం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురు(3)పై ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో కుమార్తె మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను విజయనగరంలోని ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దాంతో ఎస్ కోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. దెయ్యం పట్టిందని కారణంగానే తమపై భర్త దాడి చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement