జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ వద్ద శుక్రవారం భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ వద్ద శుక్రవారం భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదా చేయగా పది బాక్సుల్లో మొత్తం రెండు వేల జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. వీటిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకెళ్తున్నట్లు అనుమానాలున్నాయని కొత్తగూడెం ఓఎస్డీ డేవిస్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.