బేగంపేట ఎయిర్‌పోర్టులో హైసెక్యూరిటీ | high security in begumpet airport | Sakshi
Sakshi News home page

బేగంపేట ఎయిర్‌పోర్టులో హైసెక్యూరిటీ

Nov 26 2017 11:14 AM | Updated on Aug 15 2018 6:34 PM

high security in begumpet airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. 28వ తేదీనుంచి ప్రారంభం కానున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగనున్నారు. అందుకోసం  బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఎస్‌పీజీ తనిఖీలు నిర్వహించింది.

ధాని మోదీ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ప్రాంతాలను పరిశీలించింది. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ ఎస్పీజీ అధీనంలో ఉంది. బేగంపేట్ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెంచారు. భద్రతా ఏర్పాట్లను సీపీ వి.వి.శ్రీనివాస్ రావు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement