అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు

High Court Notice To Akbaruddin Owaisi - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: బెయిల్‌ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన హైకోర్టు నుంచి గతంలో బెయిల్‌ పొందారు. బెయిల్‌ షరతులకు విరుద్ధంగా అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్‌ రద్దు చేయాలని హిందూ సంఘటన్‌ అధ్యక్షుడు, న్యాయవాది కరుణ సాగర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్‌ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను కింది కోర్టు కొట్టేయడంతో హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top