బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు.
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది.