డాక్టర్స్ డేను పురస్కరించుకొని మల్లిక ఆస్పత్రి, సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన గుండె సమస్యలపై మహబూబ్నగర్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు
మహబూబ్నగర్: డాక్టర్స్ డేను పురస్కరించుకొని మల్లిక ఆస్పత్రి, సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన గుండె సమస్యలపై మహబూబ్నగర్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని తమ ఆస్పత్రిలో సదస్సు సందర్భంగా ఉచిత అవగాహన, వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మల్లిక ఆస్పత్రి ఎండీ డాక్టర్ జె.మహేష్బాబు తెలిపారు. గుండె వ్యాధి బాధితులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ గుండె స్కానింగ్ చేయనున్నామన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఉచిత అవగాహన సదస్సుకు హాజరు కావాలనుకునే వారు తమ పేర్లను 988545128, 9963471933 నంబర్లకు ఫోన్ చేసి, నమోదు చేసుకోవాలని కోరారు.