ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో విఫలం

government failed in control  illegal sand mafia - Sakshi

గంభీరావుపేట : మండలంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమయిందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. గంభీరావుపేటలో కాంగ్రెస్, టీజేఏసీ, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బుధవారం అధికారుల తీరుపై నిరసన చేపట్టారు. రాత్రింబవళ్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, అనుమతులు, ట్రాక్టర్‌లకు సంబంధించిన కాగితాల తనిఖీ చేపట్టకపోవడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఎగదండి స్వామి, దోసల చంద్రం, చేని వెంకటస్వామి, లక్ష్మీనారాయణగౌడ్, కొత్తపల్లి శ్రీనివాస్, గుడికాడి బాలయ్య, పెంటయ్య, జంగం రాజు, రాజ్‌కుమార్, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top