'పుష్కరాల ఏర్పాట్లు దాదాపు పూర్తి' | godavaripushkaras set ups completed says indrakaran reddy | Sakshi
Sakshi News home page

'పుష్కరాల ఏర్పాట్లు దాదాపు పూర్తి'

Jul 9 2015 5:15 PM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బాసర మినహా అన్ని ఘాట్లలో నీరు ఉందని చెప్పారు. బాసర ఘాట్కు మరిన్ని నీరు వదిలేలా మహారాష్ట్ర సీఎంను కోరుతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 13 సాయంత్రం ధర్మపురికి సీఎం కేసీఆర్ వస్తారని.. 14న ఉదయం పుష్కర స్నానం చేస్తారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement