పట్టాలివ్వలేదని ఓట్ల బహిష్కరణ | Formers Strike For Votes In Warangal | Sakshi
Sakshi News home page

పట్టాలివ్వలేదని ఓట్ల బహిష్కరణ

Dec 8 2018 11:02 AM | Updated on Dec 8 2018 11:02 AM

Formers Strike For Votes In Warangal  - Sakshi

పట్టాలు ఇవ్వడం లేదని ఓట్లను బహిష్కరించి ఆందోళన చేస్తున్న రైతులు   

సాక్షి, గార(ఇల్లందు): మండలంలోని వేదనాయకపురం గ్రామ రైతులు తమ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని, ఓటు వేయమని 4 గంటల పాటు రోడ్డు బైఠాయించి ఓటును బహిష్కరించారు. సమాచారం తెలసుసుకున్న తహసీల్దార్‌ కృష్ణ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకుని ఓట్లు వేయాలని కోరారు. దీంతో రైతులు మాట్లాడుతూ.. 100 సంవత్సరాల క్రితం బిషఫ్‌ హజారయ్య దగ్గర తమ ముత్తాతలు భూములు కొను గోలు చేసి సేద్యం చేసుకుంటున్నామని, పలుమార్లు రెవెన్యూ అధికారులకు భూములు పట్టాలు చేయాల ని విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఓట్ల బహిష్కరణకు సిద్ధమయ్యామని తెలిపారు.  పాస్‌పుస్తకాలు లేకపోవడంతో  రైతుబంధు డబ్బులు రాలేదని వాపోయారు. రైతుల భూములకు పట్టాలు ఇప్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి కృషి చేస్తానని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో సుమారు 168 మంది ఓటర్లు ఓటు వేసేందుకు కదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement