కార్మికుల ఆకలి తీర్చిన ‘ధరణి’

Feasting to the poor - Sakshi

సిరిసిల్ల : కార్మిక వాడల్లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థ కార్మికుల ఆకలి తీర్చింది. పట్టణంలోని గోపాల్‌నగర్‌కు చెందిన ఐన రవి ఇంట్లో శుభకార్యం సోమవారం జరిగింది. విందు భోజనం మిగిలిపోవడంతో నిర్వాహకులు ‘ధరణి’ సంస్థకు సమాచారం అందించారు. వెంటనే ఆటోలో గిన్నెలు తీసుకెళ్లి మిగిలిన విందు భోజనాన్ని సేకరించారు.

పట్టణంలో పేదలు అధికంగా ఉండే గణేశ్‌నగర్‌ కార్మిక వాడకు తీసుకెళ్లి పంపిణీ చేశారు. వేడి వేడి విందు భోజనాన్ని కార్మికులు ఇష్టంగా తీసుకెళ్లారు. 70 మందికి సరిపడా ఆహారాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ధరణి సంస్థ అధ్యక్షురాలు కె.విం ధ్యారాణి, జయసింహారెడ్డి, గుజ్జె తార, అయ్యప్ప రాము, ఠాగూర్‌ రాజు, ఠాగూర్, వినీత్, చందర్, గడ్డం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top