పోలీసుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు | ex gratia hiked for families of police encounter victims | Sakshi
Sakshi News home page

పోలీసుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు

Apr 27 2015 10:54 PM | Updated on Jul 11 2019 8:34 PM

ఉగ్రవాద, తీవ్రవాద దాడుల్లో మరణించి పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలకు అందజేసే ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెరిగింది.

హైదరాబాద్: ఉగ్రవాద, తీవ్రవాద దాడుల్లో మరణించి పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలకు అందజేసే ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత రూ.9లక్షలు వున్న ఈ ఎక్స్‌గ్రేషియాను రూ.25లక్షలకు పెంచుతూ గతేడాది మే 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

సూర్యాపేట, జానకీపురం వద్ద సిమి ముష్కరులు జరిపిన దాడుల్లో మృతి చెందిన కానిస్టేబుళ్లకు రూ.40లక్షల పరిహారం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement