ఎర్రబెల్లిపై కేసు | ERRABELLI on the case | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లిపై కేసు

Sep 28 2015 1:54 AM | Updated on Jun 4 2019 5:04 PM

మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గోదాముల శంకుస్దాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణ

పాలకుర్తి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గోదాముల శంకుస్దాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణ సంఘటనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లిపై  పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ ఉస్మాన్  షరీఫ్‌తో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు గాయాల సంఘటనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లిపై కేసులు నమోదు చేశారు.

పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో గాయాల బాదితులు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి డివిజన్‌లోని బచ్చన్నపేట  పోలీస్ స్టేషన్‌కు  తరలించినట్లుగా తెలిసింది. పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్దితి తగ్గే వరకు అడిషనల్ ఎస్పీ  జాన్ వెస్లీ పోలీస్ స్టేసన్‌లోనే ఉండి సమీక్షిస్తున్నారు. 28న ఉదయం జనగామ కోర్టులో ఎర్రబెల్లిని హాజరు పరచనున్నట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement