బైక్‌ను ఢీకొన్న కారు... ఎనిమిది మందికి గాయాలు | Eight people injured in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు... ఎనిమిది మందికి గాయాలు

May 3 2015 6:41 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఓ కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొనడంతో ఎనిమిది మంది గాయపడ్డారు.

పెద్దఅంబర్‌పేట (హైదరాబాద్): ఓ కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొనడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ వైపు నుంచి హయత్‌నగర్ వైపు వెళుతున్న ఓ కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు బైక్‌పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement