సిద్దిపేట అర్బన్: దేశ వికాసానికి మూలమైన విద్యపై విషం చిమ్ముతున్నారని సంఘటిత పోరాటంతో అడ్డుకోకుంటే ప్రమాదమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్లో సోమవారం రాత్రి విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో విలువలు మంటగలిసి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో వ్యాపారీకరణ పెరుగుతోందన్నారు. పాలకుల బాధ్యతా రాహిత్యం వల్ల ఏర్పడుతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోనే విద్యా రంగం ఉండాలన్నారు.
టీవీ, సినిమాల ప్రభావం విద్యార్థులను శాసించే స్థాయికి ఎదగడం సరికాదన్నారు. హైదరాబాద్ యునివర్సిటీ ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రశ్నించలేని వారు మేధావులు కాదన్నారు. పెట్టుబడి దారులు విద్యను ధ్వంసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ దిశగా మళ్లించడం సరికాదన్నారు. అమెరికా, యూరప్లో కామన్ స్కూల్ విద్య కొనసాగుతుండగా ఇక్కడెందుకు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది బాల కార్మికులను విద్యా స్రవంతిలో కలపాలన్నారు.
71 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగా లేరని, 76 శాతం పాఠశాలల్లో గదులు సరిగా లేవన్నారు. కాంట్రాకుటు బోధన ప్రమాదకరమన్నారు. ప్రభుత్వం అందరికి సమాన విద్యను అమలు చేస్తేనే సమసమాజం ఏర్పడుతుందన్నారు. సమావేశానికి విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ స్వాగతం పలికారు.
సభలో గురుకుల పాఠశాలల సంఘం అధ్యక్షుడు రవిచంద్రన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు పాపయ్య, జేఏసీ పశ్చిమ జిల్లా కన్వీనర్ అశోక్కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం ప్రసాద్, కార్యదర్శి యాదగిరి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కిష్టప్ప, జేవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్, టీపీఎఫ్ రాష్ట్ర నేతలు సత్తయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట హైస్కూల్ నుంచి మెదక్ రోడ్డు, పాతబస్టాండ్, సుభాష్రోడ్, మెయిన్ రోడ్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యారంగంపై విషం
Published Tue, Nov 25 2014 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement