పౌర సరఫరాల శాఖ సేవలకు ఉత్తమ అవార్డు | e-indian government to citizen award for telangana civil supply department | Sakshi
Sakshi News home page

పౌర సరఫరాల శాఖ సేవలకు ఉత్తమ అవార్డు

Nov 17 2014 2:24 AM | Updated on Sep 2 2017 4:35 PM

పౌర సరఫరాల శాఖ సేవలకు ఉత్తమ అవార్డు

పౌర సరఫరాల శాఖ సేవలకు ఉత్తమ అవార్డు

ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గానూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ‘ఈ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్’ అవార్డు లభించింది.

* త్రివేండ్రంలో పురస్కారం అందుకున్న కమిషనర్ పార్థసారథి

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గానూ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ‘ఈ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్’ అవార్డు లభించింది. శనివారం కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ-ఇండియా గవర్నెన్స్ సదస్సులో పౌర సరఫరాల శాఖ తరఫున కమిషనర్ సి.పార్థసారథి, సీఆర్‌ఓ ఎం.పద్మ, ఎన్‌ఐసీ టెక్నికల్ డెరైక్టర్ జి.శివాజీ ఈ అవార్డును అందుకున్నారు.

జాతీయ స్థాయిలో పౌర సరఫరాలశాఖ ఇలాంటి అవార్డు అందుకోవడం ఇది రెండోసారి. గతంలోనూ ఉత్తమ ఈ-పీడీఎస్ విధానానికి గానూ పౌరసరఫరాల శాఖ జాతీయ అవార్డును అందుకుంది. రాష్ట్రంలో ఆధార్‌కు ఈ-పీడీఎస్‌ను అనుసంధానించడం ద్వారా ఇప్పటికే 11.71 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేశారు. దీనిద్వారా 24,093 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,406 కిలో లీటర్ల కిరోసిన్‌ను ఆదా చేయగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement